Share News

హృదయాలయంలో గవర్నర్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:39 AM

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్‌, శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రులను గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ దంపతులు శుక్రవారం సందర్శించారు.బర్డ్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల తయారీ, అమరిక కేంద్రాన్ని పరిశీలించారు.ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులు, స్కానింగ్‌ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు.

హృదయాలయంలో గవర్నర్‌
బర్డ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని పలుకరిస్తున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

తిరుపతి(వైద్యం), ఏప్రిల్‌ 26: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్‌, శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రులను గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ దంపతులు శుక్రవారం సందర్శించారు.బర్డ్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల తయారీ, అమరిక కేంద్రాన్ని పరిశీలించారు.ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులు, స్కానింగ్‌ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ అవయవాల తయారీ, అమరికను గవర్నర్‌కు బర్డ్‌ ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి వివరించారు. అనంతరం హృదయాలయకు వెళ్లిన గవర్నర్‌.. అక్కడి వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. చికిత్స కోసం వచ్చిన చిన్నారులతో ముచ్చటించారు.ఆస్పత్రిలోని క్యాథ్‌ల్యాబ్‌, ఐసీయూ, ఓటీ థియేటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఇప్పటి వరకు చేసిన గుండె మార్పిడి శస్త్ర చికిత్సల గురించి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి వివరించారు.

Updated Date - Apr 27 , 2024 | 01:39 AM