టీడీపీ బీసీ నేతలే టార్గెట్
ABN , Publish Date - Apr 28 , 2024 | 01:45 AM
మద్యం, నగదు ఉన్నాయంటూ తనిఖీలు
చిత్తూరు సిటీ, ఏప్రిల్ 27: టీడీపీ బీసీ నేతలే టార్గెట్గా వారి ఇళ్లలో ఎన్నికల అధికారులు, పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. మద్యం, నగదు ఉందన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. సంతపేటలో చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత పి.షణ్ముగం, టీడీపీ చిత్తూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్.ఈశ్వర్ (ఆయన సతీమణి ఆర్.రతీదేవి టీడీపీ మాజీ కార్పొరేటర్), 47వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి ఉదయ్కుమార్ నివాసాల్లో తనిఖీలు చేసి, ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కావాలనే తమపై అసత్య ప్రచారం చేసి, పోలీసులతో సోదాలు నిర్వహించి అవమానపరచారని విమర్శించారు. ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.