Share News

కూటమి అభ్యర్థులను గెలిపించండి

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:14 AM

రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని అమలాపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు కోరారు.

కూటమి అభ్యర్థులను గెలిపించండి

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 25: రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని అమలాపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు కోరారు. గురు వారం ఆయన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబుతో కలిసి పట్టణ పరిధిలోని 15, 16, 17 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రవేశపెట్టి సూపర్‌-6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచారంలో నాయకులు అల్లాడ స్వామినాయుడు, పెచ్చెట్టి విజయలక్ష్మి, ఇసుకపట్ల రఘుబాబు, యేడిద శ్రీను, తిక్కిరెడ్డి నేతాజీ, గంపల దుర్గాప్రసాద్‌, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, బొర్రా చిట్టిబాబు, దంతులూరి వాసురాజు, పలివెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:14 AM