Home » Andhra Pradesh » East Godavari
ఆరోగ్యశ్రీ అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ సీఎం జగన్ గొప్పలు చెప్పుకోవడం మినహా వాస్తవంలో అన్నీ లోపాలే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి తూర్పుగోదావరి (నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరులతో కలిపి) జిల్లాలో మొత్తం 411 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం పరిశీలన అనంతరం 114 నామినేషన్లు తిరస్కరించారు. ఇందులో లోక్సభలకు 22, అసెంబ్లీలకు 92 ఉన్నాయి.
రాజోలు అనే పదం తనకు తీపి గుర్తు అని, కోనసీమ కొబ్బరి బొండం ఎంత తీపిగా ఉంటుందో 2019లో ఒక్క రాజోలు విజయం తనకు అంత ఆనందాన్ని ఇచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజోలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
మాదిగలను ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదనిమాదిగ సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబును జేఏసీ నాయకులు కలిశారు.
రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మొ త్తం 26 నామినేషన్లకుగాను 14 నామినేషన్లను తిరస్కరించినట్లు, 12 నామినే షన్లను ఆమోదించామని రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్ తెలిపారు.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో అవి నీతి రాజ్యమేలుతోందని, అవినీతిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు.
భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న ద్రాక్షారపు సాత్విక్ జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైనట్టు ఫిజికల్ డైరెక్టర్లు కరాటం రవిసుఽధీర్, మురళీకృష్ణ తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం అందించడంతో పాటు సంపదను సృష్టించే సత్తా కలిగిన ఉమ్మడి కూటమి ప్రభుత్వ స్థాపనకు ప్రజలంతా తోడ్పాటునివ్వాలని ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) పేర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు నిల్వ చేసిన మద్యంపై స్టేట్ ఎస్ఈబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు ప్రకటించారు. టీడీపీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.