Share News

బ్యాండేజీ స్టిక్కర్లతో వర్మ వినూత్న ప్రచారం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:06 AM

పిఠాపురం/కొత్తపల్లి, ఏప్రిల్‌ 25: జగన్‌రెడ్డి గులకరాయి డ్రామాను ఎండగడుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, నేతలు వినూత్నరీతిలో ప్రచారం నిర్వహించారు. తమకు కూడా గులకరాయి దెబ్బలు తగిలాయంటూ తలకు బ్యాండేజీ స్టిక్కర్లుతో ఇంటింటికి వెళ్లి జగన్‌రెడ్డి సా

బ్యాండేజీ స్టిక్కర్లతో వర్మ వినూత్న ప్రచారం
పిఠాపురంలో తలకు స్టిక్కర్లతో వర్మ, నేతల ప్రచారం

జగన్‌రెడ్డి గులకరాయి డ్రామాపై ఫైర్‌

పిఠాపురం/కొత్తపల్లి, ఏప్రిల్‌ 25: జగన్‌రెడ్డి గులకరాయి డ్రామాను ఎండగడుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, నేతలు వినూత్నరీతిలో ప్రచారం నిర్వహించారు. తమకు కూడా గులకరాయి దెబ్బలు తగిలాయంటూ తలకు బ్యాండేజీ స్టిక్కర్లుతో ఇంటింటికి వెళ్లి జగన్‌రెడ్డి సానుభూతి కోసం ఆడుతున్న నాటకాలను ప్రజలకు వివరించారు. గులకరాయి దెబ్బ అంటూ వారాల తరబడి సీఎం జగన్‌ తలకు బ్యాండేజీ స్టిక్కరు పెట్టుకుని ప్రజల్లో సానుభూతి కోసం చేస్తున్న యాక్టింగ్‌ను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పిఠాపురం నియోజకవర్గంలో వినూత్నంగా నిరసన ప్రచారం సాగించారు. వీరంతా తమకు గులకరాయి దెబ్బలు తగిలాయంటూ ముఖంపై స్టిక్కర్లు అంటించుకుని జగన్‌ డ్రామాను ప్రజలకు వివరిస్తూ వ్యంగ్యంగా సాగించిన ఈ ప్రచారం అం దరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల్లో ముంచేసిన జగన్‌ ఇప్పుడు ప్రజలు వాటిని అన్నింటిని మర్చిపోయి తనకు సానుభూతితో ఓటు వేయాలనే గులకరాయి డ్రామాకు తెరలేపారని వర్మ విమర్శించారు. బ్యాండేజీ స్టిక్కరు చూసి ఓటు వేయాలని కోరడం హా స్యాస్పదంగా ఉందని వాఖ్యానించారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని గంజాయి, అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చివేశారని మండిపడ్డారు. పోలవరం కట్టడం చేతకాక చేతులు ఎత్తివేశారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి పోలీసులతో పాలన సాగించారని మండిపడ్డారు. వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఓటు ద్వారా తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారని, ఇది తెలుసుకుని గులకరాయి డ్రామాకు జగన్‌ తెరలేపారని చెప్పారు.

Updated Date - Apr 26 , 2024 | 12:06 AM