Share News

దళితుల సంక్షేమ పథకాలను రద్దుచేసిన ఘనత వైసీపీదే

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:33 AM

దళిత మంత్రితో పాటు బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగలబెడితే కనీసం పరామర్శ కూడా చేయని ముఖ్యమంత్రిగా జగన్‌ నిలుస్తారని అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి జంగా గౌతమ్‌ విమర్శించారు.

 దళితుల సంక్షేమ పథకాలను రద్దుచేసిన ఘనత వైసీపీదే

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 27: దళిత మంత్రితో పాటు బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగలబెడితే కనీసం పరామర్శ కూడా చేయని ముఖ్యమంత్రిగా జగన్‌ నిలుస్తారని అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి జంగా గౌతమ్‌ విమర్శించారు. ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీల నాయకులతో కలిసి అమలాపురంలో శనివారం నిర్వహించిన సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కొప్పుల సత్తిబాబు అధ్యక్షత వహించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వక్తలు తీవ్రస్థాయిలో విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు చీకట్ల అబ్బాయి, యార్లగడ్డ రవీంద్ర, వంటెద్దు బాబి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ తరపున పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అయితాబత్తుల సుభాషిణి, రౌతు ఈశ్వరరావు, పాలెపు ధర్మారావు, సరెళ్ల ప్రసన్నకుమార్‌, కోట శ్రీనివాసరావులతో కలిసి ప్రచార రథాన్ని గౌతమ్‌ ప్రారంభించారు.

Updated Date - Apr 28 , 2024 | 01:33 AM