రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:07 AM
రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని పాలంగి, తాడిపర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు
ఉండ్రాజవరం/నిడదవోలు, ఏప్రిల్ 26: రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని పాలంగి, తాడిపర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా చేస్తామన్నారు. నిడదవోలులో డాక్టర్ తోప రాల కళ్యాణచక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ మెడికల్ ప్రాక్టీ షనర్స్ ఆత్మీయ సమావేశానికి దుర్గేష్ విచ్చేసి మాట్లాడారు. తనను ఎమ్మె ల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో పీఎంపీ అసోసియేషన్ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అలాగే స్థానిక 25వ వార్డుకు చెందిన మహిళలు సుమారు 50మంది జనసేనలో చేరారు. వారికి దుర్గేష్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. కార్యక్రమాల్లో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి భోగవల్లి ప్రసాద్, సింహాద్రి రామకృష్ణ, కొమ్మిన వెంకటేశ్వరరావు, కేవీ సుబ్బారావు, జీవీ సుబ్రహ్మణ్యం, కుదప చక్రపాణి, ఈడ్పుగంటి ఉదయకుమార్, వీరమళ్ల బాలాజీ, కాకర్ల నాని, దిద్దే మధుబాబు, రంగా రమేష్ పాల్గొన్నారు.