Share News

Chandrababu: జే బ్రాండ్‌ డబ్బులు జగ్గూభాయ్‌కే.. చంద్రబాబు నిప్పులు

ABN , Publish Date - May 06 , 2024 | 01:51 PM

రాష్ట్రంలో జే బ్రాండ్ పని అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జే బ్రాండ్‌ను స్మశానానికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే డబ్బులు జే బ్రాండ్ డాన్ జగ్గూ బాయ్‌కు వస్తున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం బాగోలేకున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Chandrababu: జే బ్రాండ్‌ డబ్బులు జగ్గూభాయ్‌కే.. చంద్రబాబు నిప్పులు
chandrababu

కర్నూలు: రాష్ట్రంలో జే బ్రాండ్ పని అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) తీవ్రస్థాయిలో విమర్శించారు. జే బ్రాండ్‌ను స్మశానానికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే డబ్బులు జే బ్రాండ్ డాన్ జగ్గూ బాయ్‌కు వస్తున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం బాగోలేకున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కల్తీ మద్యం తాగి చనిపోతున్నా సీఎం జగన్ లెక్క చేయడం లేదని మండిపడ్డారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.


జీవో ప్రతులు తగలబెట్టి..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు మాట్లాడారు. దాని వల్ల మీ ఇళ్లు, పొలం ఏవీ మీ పేరు మీద ఉండవని ప్రజలకు సూచించారు. దానికి సంబంధించిన జీవో ప్రతులను చంద్రబాబు తగల బెట్టారు. సీఎం జగన్ సైకో అని విమర్శించారు. అబద్దాలు చెప్పి, చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు మరమ్మతులు చేయక పోవడంతో కొట్టుకుపోయాయని వివరించారు. పాన్యం ఎమ్మెల్యేగా గౌరు చరితా రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని భారీ మెజార్టీతో గెలిపించండితో గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు.


Read Latest AP News And Telugu news


Updated Date - May 06 , 2024 | 02:00 PM