Share News

Nara Lokesh: విశ్వజిత్‌గా నరేంద్ర మోదీ

ABN , Publish Date - May 06 , 2024 | 04:34 PM

ప్రధాని నరేంద్ర మోదీపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. మోదీ విశ్వజిత్ అని అభిప్రాయ పడ్డారు. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వారని వివరించారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధాని మోదీ నిలిపారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో నారా లోకేశ్ మాట్లాడారు.

Nara Lokesh: విశ్వజిత్‌గా నరేంద్ర మోదీ
Nara Lokesh

రాజమహేంద్రవరం: ప్రధాని నరేంద్ర మోదీపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) ప్రశంసలు కురిపించారు. మోదీ విశ్వజిత్ అని అభిప్రాయ పడ్డారు. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వారని వివరించారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధాని మోదీ నిలిపారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో నారా లోకేశ్ మాట్లాడారు.


భారతదేశ దశ దిశ మార్చింది నమో నమో అనే నాలుగు అక్షరాలు మాత్రమేనని లోకేశ్ తెలిపారు. తెలుగు పౌరుషాన్ని దేశానికి దివంగత నందమూరి తారక రామారావు పరిచయం చేశారని గుర్తుచేశారు. భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రాభివృద్ధి వేగంగా జరిగిందని వివరించారు. ఇప్పుడు అభివృద్ధి పడకేసిందని వెల్లడించారు. తమ హయాంలో విశాఖపట్టణాన్ని ఐటీ హబ్‌గా చేశామని గుర్తుచేశారు. ప్రజాగళం సభలో నారా లోకేశ్‌ను ప్రధాని మోదీ భుజం తట్టి మరి అభినందించారు. పేదరికం లేని సమాజం ప్రధాని మోదీ కల అని నారా లోకేశ్ స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి ద్వారా మోదీ దేశాన్ని డెవలప్ చేస్తున్నారని వివరించారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా మారిందని లోకేశ్ విరుచుకుపడ్డారు.



Read Latest
AP News And Telugu news

Updated Date - May 06 , 2024 | 04:45 PM