Share News

ఎవరికి ఓటు వేశామో తెలుసుకోవచ్చు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:53 PM

ఈవీఎంలో మనం ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు. నచ్చిన అభ్యర్థి పార్టీకి వేసిన ఓటు సక్రమమేనా లేక క్రాస్‌ అయిందా అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ ఓటరు వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీ ప్యాట్‌) ద్వారా కల్పిస్తోంది. వేసిన ఓటును చూసుకునే అవకాశం ఏడు సెకన్ల వరకు మాత్రమే ఉంటుంది. అనంతరం ఆ ఓటు వీవీ ప్యాడ్‌ బాక్స్‌లో పడిపోతుంది. ఈ విధానాన్ని తొలిసారిగా 2013 సెప్టెంబరులో నాగాలాండ్‌లో నోక్సెల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలలో అమలు చేశారు. ఆ తరువాత దశల వారీగా అంతటా అమల్లోకి వచ్చింది. వేసిన ఓటును సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించడం, బహిర్గతం చేయడం మాత్రం నిషేధం. ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

ఎవరికి ఓటు వేశామో తెలుసుకోవచ్చు

నరసన్నపేట: ఈవీఎంలో మనం ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు. నచ్చిన అభ్యర్థి పార్టీకి వేసిన ఓటు సక్రమమేనా లేక క్రాస్‌ అయిందా అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ ఓటరు వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీ ప్యాట్‌) ద్వారా కల్పిస్తోంది. వేసిన ఓటును చూసుకునే అవకాశం ఏడు సెకన్ల వరకు మాత్రమే ఉంటుంది. అనంతరం ఆ ఓటు వీవీ ప్యాడ్‌ బాక్స్‌లో పడిపోతుంది. ఈ విధానాన్ని తొలిసారిగా 2013 సెప్టెంబరులో నాగాలాండ్‌లో నోక్సెల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలలో అమలు చేశారు. ఆ తరువాత దశల వారీగా అంతటా అమల్లోకి వచ్చింది. వేసిన ఓటును సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించడం, బహిర్గతం చేయడం మాత్రం నిషేధం. ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

Updated Date - Apr 27 , 2024 | 11:53 PM