Home » Andhra Pradesh » Srikakulam
జిల్లాలో రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమదాలవలస నియోజకవర్గం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఐదేళ్లకోసారి ఎన్నికల వేళ నేతల హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ప్రధానంగా దశాబ్దాల చరిత్ర కలిగిన చక్కెర కర్మాగారం మూతపడడంతో రైతులకు, కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు అధికార దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు, కూటమి సానుభూతిపరులపై భౌతికదాడులకు పాల్పడుతున్నారు. బాధితులు ఎవరైనా ప్రశ్నిస్తే.. మమ్మల్నే ఎదిరిస్తార్రా? అంటూ వారిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం అన్ని రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్లు పరిశీలించారు. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు.
‘వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమ’ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
‘ఓటేద్దాం-శ్రీకాకుళం’ అనే అంశంపై వీడియో తయారీ, పోస్టర్ డిజైన్ చేయుటకు ఆన్లైన్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్కు మద్దతుగా ప్రముఖ సినీహీరో, మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం వస్తుంటే ఆయనపై వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, సజ్జల ఓ సన్నాసి అని కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆలేటి ప్రకాష్ అన్నారు.
జాతీయ లోక్ అదాలత్ జూన్ 29న నిర్వహిస్తామని జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలోని కోర్టు ఆవరణలో.. పోలీసులు, ఇన్సూరెన్స్, న్యాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో సాగు తున్న దగాకోరు వైసీపీ ప్రభు త్వాన్ని గద్దె దించాలని టీడీ పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మె ల్యే కింజరాపు అచ్చెన్నా యుడు కోరారు. శుక్రవారం సీతా పురం, తిర్లంగి, తిర్లంగి కాల నీ, రాధావల్లభాపురం గ్రా మాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.
పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి శనివారం పాలిసెట్ నిర్వహించనున్నట్టు సమన్వయ కర్తలు గురుగుబెల్లి దామోదరరావు, ఎ.గోపి తెలిపారు.
మెళియాపుట్టి మండల కేంద్రంలో గురజాడ ప్రభావతి (50) అనుమానా స్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ టి.రాజేష్ తెలిపారు.