Share News

Lok Sabha Polls: ప్రశాంతంగా ముగిసిన మూడో దశ.. సాయంత్రం 5 గంటలకు 60.19 శాతం పోలింగ్

ABN , Publish Date - May 07 , 2024 | 06:52 PM

లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగమైన మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గడువు సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ అధికారులు ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. కాగా సాయంత్రం 5 గంటల సమయానికి మూడో దశ పోలింగ్ 60.19 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Lok Sabha Polls: ప్రశాంతంగా ముగిసిన మూడో దశ.. సాయంత్రం 5 గంటలకు 60.19 శాతం పోలింగ్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగమైన మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గడువు సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ అధికారులు ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. కాగా సాయంత్రం 5 గంటల సమయానికి మూడో దశ పోలింగ్ 60.19 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా ఈ దశలో 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.

రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం చూస్తే..

1. అసోం - 74.86%

2. బీహార్ - 56.01%

3. చత్తీస్‌గఢ్ - 66.87%

4. దాద్రానగర్-హవేలీ, అండమాన్ నికోబార్ - 65.23%

5. గోవా - 72.52%

6. గుజరాత్ - 55.22%

7. కర్ణాటక - 66.05%

8. మధ్యప్రదేశ్ - 62.28%

9. మహారాష్ట్ర - 53.40%

10. ఉత్తరప్రదేశ్ - 55.13%

11. పశ్చిమ బెంగాల్ - 73.93%.

Updated Date - May 07 , 2024 | 06:52 PM