Home » Elections » Lok Sabha
మోదీ పాలనలో అచ్చె దిన్ రాలేదు కాని.. చచ్చే దిన్ మాత్రం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఇచ్చిన 150 హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా బుధవారం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. పటాన్ చెరు జాతీయ రహదారిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు దీక్ష చేసినప్పుడు వచ్చానని అన్నారు. వారు ఇచ్చిన సహకారంతో పీసీసీ అధ్యక్షుడినయ్యానని గుర్తుచేశారు. నిజామాబాద్ లోని ఆర్మూర్లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని మాటిచ్చారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని మండిపడ్డారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. నిన్న(మంగళవారం) ఓ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని.. కురే కురే బీజేపీ అని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) కి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) అన్నారు. కేసీఆర్కి సిగ్గు, లజ్జ ఉందా ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చావు నోట్లో తల ఎక్కడ పెట్టారని నిలదీశారు. ఆయన ప్రజల్లో నిరాదరణకు గురి అయ్యారని... కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లారని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 17 స్థానాల్లో కనీసం 14 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని గుర్తుచేశారు.
మాజీ సీఎం కేసీఆర్ (KCR) అంటే భయంతోనే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రైతు బంధును మళ్లీ మొదలుపెట్టిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) అన్నారు. రైతు బంధును ఎన్నికల కమిషన్ ఆపమని చెప్పిందని అబ్బద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు విషయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు నిజమా భట్టి విక్రమార్క మాటలు నిజమా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకుముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. దర్శనానికి ముందు కోడె మొక్కును సమర్పించారు. గతంలో ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఎవరూ కూడా కోడె మొక్కు అందించలేదు.