Share News

Delhi: ఎన్నికల ప్రచారంలో స్పృహ తప్పిన గడ్కరీ

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:35 AM

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్రలోని యావత్మల్‌లో బుధవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ స్పృహ తప్పారు.

Delhi: ఎన్నికల ప్రచారంలో స్పృహ తప్పిన గడ్కరీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్రలోని యావత్మల్‌లో బుధవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ స్పృహ తప్పారు. అనంతరం కొద్దిసేపటికే ఎక్స్‌లో ఈ విషయమై స్పందిస్తూ... తీవ్రమైన ఎండవేడితో తాను స్పృహ తప్పానని, ప్రస్తుతం బాగానే ఉన్నానని ప్రకటించారు. పుసాద్‌లో ర్యాలీ సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిపారు.

నాగ్‌పూర్‌ సిటింగ్‌ ఎంపీ అయిన కేంద్రమంత్రి గడ్కరీ యావత్మల్‌లోని పుసాద్‌లో ప్రసంగిస్తూ కుప్పకూలారు. పార్టీ కార్యకర్తలు వెంటనే వైద్యసేవలకు తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా కేంద్రమంత్రి యావత్మల్‌-వాషిమ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న ఏక్‌నాథ్‌ షిండే శివసేనవర్గానికి చెందిన మహాయుతి కూటమి అభ్యర్థి రాజశ్రీపాటిల్‌కి మద్దతుగా ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

Updated Date - Apr 25 , 2024 | 07:12 AM