TDP: జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు..

ABN, Publish Date - Apr 23 , 2024 | 12:40 PM

జగ్గంపేట.. జనసంద్రమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు జనం పోటె త్తారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలి వచ్చారు. ప్రజాగళం బహిరంగసభకు వచ్చి.. చంద్రబాబుకు నీరాజనం పలికారు. భారీఎత్తున హాజరైన ప్రజలను చూసి చంద్రబాబు సైతం ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు సోమవారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టారు.

TDP: జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 1/6

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా, జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు విచ్చేసిన సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం..

TDP: జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 2/6

కాకినాడ జిల్లా, జగ్గంపేట ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..

TDP: జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 3/6

టీడీపీ అధినేత నారా చంద్రబాబు జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు విచ్చేసిన టీడీపీ మహిళా కార్యకర్తలు.. విక్టరీ సంకేతం చూపుతున్న దృశ్యం.

TDP: జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 4/6

జగ్గంపేటలో ప్రజాగళం బహిరంగ సభకు భారీఎత్తున హాజరైన ప్రజ లను చూసి ఉబ్బితబ్బిబైన చంద్రబాబు..

TDP: జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 5/6

కాకినాడ జిల్లా, జగ్గంపేట ప్రజాగళం బహిరంగ సభలో జిల్లా నేతలతో చంద్రబాబు..

TDP: జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు.. 6/6

జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభకు మండుటెండను సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనం..

Updated at - Apr 23 , 2024 | 12:40 PM