భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో దృశ్యాలు..
ABN, Publish Date - Apr 22 , 2024 | 01:38 PM
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా అభ్యర్థితో కలిసి భువనగిరిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పళ్ల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నదుల్లో ఒకటిగా ఉన్న మూసీ నదిని రూ.60 వేల కోట్లతో ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి ఆనగా చెబుతున్నా ఆగస్టు 15వ తేదీలోపు రైతుల రూ.2లక్షల రుణమాఫీ పూర్తిచేస్తానని వాగ్ధానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోపే ఐదు గ్యారెంటీలను అమలు చేశామన్నారు.
Updated at - Apr 22 , 2024 | 01:38 PM