Share News

బైక్‌ అదుపుతప్పి కిందపడి యువకుడి మృతి

ABN , Publish Date - May 07 , 2024 | 12:03 AM

బైక్‌ అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్రగాయాలపాలై ఓ యువకుడు మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాగన్నగూడ వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

బైక్‌ అదుపుతప్పి కిందపడి యువకుడి మృతి

ఆదిభట్ల, మే 6 : బైక్‌ అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్రగాయాలపాలై ఓ యువకుడు మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాగన్నగూడ వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం రాగన్నగూడకు చెందిన ఇమ్మానియేల్‌(22) మిత్రుడు నరేష్‌(33)లు బ్రహ్మణపల్లిలోని చాక్‌లెట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం పని ముగించుకొని పల్సర్‌ బైక్‌పై తిరిగి వస్తుండగా అదుపు తప్పి కిందపడి పోయారు. ఇమ్మానియేల్‌ తలకు బలమైన గాయాలు కాగా నరేష్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఇమ్మానియేల్‌ (22) అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నరే్‌షను మెరుగైన చికిత్స కోసం ఎల్బీ నగర్‌లోని ప్రయివేటు అస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - May 07 , 2024 | 12:03 AM