Share News

డిప్యూటీ తహసీల్దార్‌, రికార్డు అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:24 AM

ఆర్వోఆర్‌, పహాణీ కోసం విశ్వనాథ్‌పూర్‌కు చెందిన అశోక్‌రెడ్డి(ఆర్మీ జవాన్‌) నుంచి రూ.40వేలు డిమాండ్‌ చేసిన కొందుర్గు డిప్యూటీ తహసీల్దార్‌ ఎన్‌.కిష్టయ్య, రికార్డు అసిస్టెంట్‌ బాల్‌రాజ్‌ను కలెక్టర్‌ సస్పెన్షన్‌ చేసినట్లు తహసీల్దార్‌ రమేష్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు.

డిప్యూటీ తహసీల్దార్‌, రికార్డు అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

కొందుర్గు, ఏప్రిల్‌ 26: ఆర్వోఆర్‌, పహాణీ కోసం విశ్వనాథ్‌పూర్‌కు చెందిన అశోక్‌రెడ్డి(ఆర్మీ జవాన్‌) నుంచి రూ.40వేలు డిమాండ్‌ చేసిన కొందుర్గు డిప్యూటీ తహసీల్దార్‌ ఎన్‌.కిష్టయ్య, రికార్డు అసిస్టెంట్‌ బాల్‌రాజ్‌ను కలెక్టర్‌ సస్పెన్షన్‌ చేసినట్లు తహసీల్దార్‌ రమేష్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు. అశోక్‌రెడ్డికి తన మూడున్నర ఎకరాల భూమికి సంబంధించి ఆర్వోఆర్‌, పహాణీలు కావాలని అశోక్‌రెడ్డి అన్న మహేశ్వర్‌రెడ్డి 2024 జనవరిలో దరఖాస్తు చేయగా.. అశోక్‌రెడ్డి రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాడు. రికార్డు అసిస్టెంట్‌ బాల్‌రాజ్‌, కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ప్రైవేట్‌ వ్యక్తి ఆయనను రూ.40వేలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 27 , 2024 | 12:24 AM