Home » Telangana » Hyderabad
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే షకీల్కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. మార్చి 17- 2022 లో రోడ్ నెంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల బాలుడుపై కారు దూసుకెళ్లింది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు స్పీకర్కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ ఉన్నారు.
Telangana: కోకాపేటలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్ను ఓ ఆటో ఢీకొట్టి.. ఆపై ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే తమ బిడ్డ ప్రాణాలతో లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Telangana: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ హిస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
మూడేళ్ల పాటు తెలంగాణకు గవర్నర్గా వ్యవహరించిన తమిళిసై రాజీనామా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అసలెందుకు ఆమె రాజీనామా చేశారు? గత సీఎం కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్న సమయంలో కూడా రాజీనామా చేయాలని కూడా ఆమె భావించలేదు.
తమిళిసై ఇవాళ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
Telangana: ఇప్పటి వరకు ఇళ్లలోనే చోరీకి తెగబడ్డ చెడ్డి గ్యాంగ్ కన్ను ఇప్పుడు స్కూళ్లపై పడింది. రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్ హల్చల్ అంతా ఇంతా కాదు. అర్ధరాత్రులు ఇళ్లలోకి చొరబడి దొరికినకాడికి దోచుకుంటుంది ఈ చెడ్డి గ్యాంగ్. ఇప్పుడు ఆ గ్యాంగ్.. స్కూళ్లను టార్గెట్గా చేసుకుంది. మియాపూర్లోని ఓ స్కూల్లో చెడ్డి గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత తరుఫున ఆమె భర్త అనిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే ఈడీ అరెస్టు చేసినట్లు పిటిషన్లో కవిత పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థ పై తగిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.
Telangana: నగరంలోని ఫిల్మ్నగర్లో విషాదం చోటు చేసుకుంది. చెరువు వద్ద ఆదుకునేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు ఓ బాలుడు చెరువులో పడ్డాడు. అయితే విషయం గమనించిన మరో బాలుడు పవన్.. బాలుడిని కాపాడేందుకు వెళ్ళి నీటిలో మునిగాడు. ఇద్దరు బాలురను గమనించి స్థానికులు వారిని రక్షించేందుకు వెంటనే చెరువులోకి దూకారురర.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.