Home » Education News
పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజెట్ పరీక్షలను జూలై నెలలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు సీపీజెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. దాని ప్రకారం ఈనెల 18 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 25 వరకు, రూ.2 వేల ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. జూలై 5వ తేదీ నుంచి సీపీజెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు కలలు కటుంటారు. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదవుకోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని ఎంతోమంది ఆశిస్తుంటారు. అటువంటి విద్యార్థుల కోసం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు ప్రకటించింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మే 31 వరకు స్టూడెంట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి ఫలితాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఓ ప్రకటన వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో ఐసెట్ (TS ICET) దరఖాస్తులకు గడువు పొడిగించారు.మార్చి 5వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మే 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.08లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు.
ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహించే దిశగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎ్సఈ) సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు)లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థుల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ (JEE Advanced 2024) రిజిస్ట్రేషన్ నేటి నుంచి మొదలు కానుంది. JEE కొత్త దరఖాస్తు ఫారమ్ jeeadv.ac.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
వసూళ్ల వ్యవహారం మొత్తం సీనియర్ మంత్రి పేషీ కేంద్రంగానే జరిగింది. తొలుత క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి టీచర్లు సిఫారసు లేఖలు తెచ్చుకున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు((Telangana State Board of Intermediate Education) కార్యాయలంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను..
రాష్ట్రంలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాల్లో ఉద్యోగాల కోసం పేర్లు నమోదుచేసుకున్న వారి సంఖ్య 54.25 లక్షలుందని రాష్ట్రప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది..