Home » NTR District
నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగు వద్ద ముంబాయి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది.
ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు దృష్టిలో పెట్టుకుని, ఇబ్రహీంపట్నంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండటంతో పెట్రోల్ బంక్లలో లూజ్ పెట్రోల్ పోయడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల యాజమాన్యంతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు.
పెళ్లైన నాటి నుంచి కష్టసుఖాల్లో ఒకరికి ఒకరుగా ఉన్న ఆ దంపతులు చివరికి చావులోనూ ఒక్కటిగానే ఉన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్తూరు సూర్యనారాయణ(92), రుక్మిణీ(86) అనే దంపతులు దుర్మరణం చెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వారితో పాటు ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Andhrapradesh: జిల్లాలోని విజయవాడ పార్లమెంటు , ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లోకి తరలించారు. ఈ సందర్భంగా నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. 27 స్ట్రాంగ్ రూంలు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరుగుతుందన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డిల్లీరావు(Dilli Rao) తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల పరిశీలన అధికారి మోహన్ వచ్చారని చెప్పారు.
Andhrapradesh: విజయవాడ, మే 11: మే 13న ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగ్కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రేపు(ఆదివారం) పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు.
Andhrapradesh: ఎన్నికలకు మరికొద్దిరోజులే ఉన్నప్పటికీ వైసీపీలో మాత్రం వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని శివనాథ్(చిన్ని) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు టీడీపీలో చేరారు.
Andhrapradesh: కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం (Election Commission) నామినేషన్లను స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో రెండో రోజు మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు చెప్పారు.
Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.