Home » Vasantha Venkata Krishna Prasad
వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. - మంగళవారం తోలుకొడు, వెదురు బీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విరుచుకుపడ్డారు. ‘‘తన అడుగులకు మడుగులోత్తలేదని.. టిక్కెట్ ఇస్తా... ఖర్చులు మొత్తం నేనే భరిస్తా..
మైలవరం (Mylavaram) నియోజకవర్గ తాగు, సాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యమని మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్రహీంపట్నం మండల తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. 5 నెలల్లో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్తో (Vasantha Krishna Prasad) ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి..
Andhrapradesh: ఎన్నికల వేళ అధికారపార్టీ వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా రెడ్డిగూడెం ఎంపీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎంపీపీతో పాటు రెడ్డిగూడెం మండలం నుంచి 60 కుటుంబాలకు పైగా ప్రజలు టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో పలువురు నాయకుడు వైసీపీని వీడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు రామినేని దేవీప్రావీణ్య కూడా వైసీపీకి...
నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఆరోపించారు. రెడ్డిగూడెం గ్రామంలో కూటమి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మైలవరం నియోజకవర్గం మొదట్లో కమ్యునిస్టుల పాలనలో ఉండేది. అనంతరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. చనమోలు వెంకట్రావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ఉద్దండులు గెలిచిన నియోజకవర్గం ఇది.
Andhrapradesh: కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికలు-2024కు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు సమర్పించగా మరికొందరు సన్నద్ధమవుతున్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ రేపు (సోమవారం) నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కార్యాలయానికి వసంత కృష్ట ప్రసాద్ వెళ్లారు.
Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. న్నికలకు కొద్ది రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున వారి కుటుంబసభ్యులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు, అన్న కోసం తమ్ముడు ఇలా అభ్యర్థుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ...