Home » Telangana » Warangal
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమం చేసి సీఎం కాలేదని.. బోకరిజం చేస్తూ సీఎం అయ్యారని కామెంట్స్ చేశారు. ప్రజాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయేవాడు కాదన్నారు. కడియం శ్రీహరిని తానే పిలిచాను అని రేవంత్ అన్నారని..
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు గురువారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించటంతో ఆతర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ ఈ పట్టభద్రుల స్థానానికి నిబంధనల ప్రకారం జూన్ 8వ తేదీలోపు ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
మనం రోజువారీ తాగే నీ రు పరిశుభ్రంగా లేకపోతే అనేక రోగాలు వచ్చే అవకా శం ఉంటుంది. స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమల్లోకి తెచ్చింది. కానీ పైపులైన్లు, గేట్వాల్వ్ లీకేజీలు, నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయకపోవడం వం టి కారణాల వల్ల శుద్ధజలం కలుషితమవుతోంది.
అడవి అంటే పచ్చని చెట్లు.. పారేటి వాగులు.. వంకలు.. పక్షుల కిలకిలరావాలు.. వన్యప్రాణుల గెంతులాటలు ఇది పాత మాట.. ప్రస్తుతం ఎండిన నీటి వనరులు.. విద్యుదాఘాతాలు.. అగ్నిప్రమాదాలతో అటవీ ప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.
ములుగు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని గట్టిగా కృషిచేస్తోంది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, నల్లగుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
గిరిజనులకు పెద్ద దిక్కుగా ఉన్న ఐటీడీఏ క్రమేపీ తన అస్తిత్వాన్ని కోల్పోతోందా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఏర్పడిన ఐటీడీఏ లక్ష్యానికి దూరంగా వెళ్తుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 32 శాఖల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజనుల బతుకులు మార్చేందుకు ఐటీడీఏకు అంకురార్పణ జరగ్గా క్రమేణా కొన్ని శాఖలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
Telangana: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.
ఏటా గోదావరి వరద ముం పునకు గురవుతున్న ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని తీర గ్రామాలకు రక్షణగోడ నిర్మించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాలకుల పట్టింపులేని తనానికి.. కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం తోడవ్వడంతో ఈసారి కూడా ముంపు ప్రమాదం పొంచి ఉంది. నిధుల కేటాయింపు, భూసేకరణ లాంటి పలు అవరోధాలను అధిగమించినా పనులు మొదల వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో స్వల్ప నుంచి మోస్తరు వానలు కురిశాయి. బలమైన ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా జిల్లాలో ఆయా ప్రాంతాల్లో చేలల్లో వరి పంటలు నేలకొరిగాయి.
అనేక రకాల పోషకాలు లభిస్తాయనే నమ్మకం తో అందరూ పాలు తాగుతారు. ముఖ్యంగా పిల్లలు, అనారోగ్యం బారిన పడినవారు, బలహీనంగా ఉన్నవారు పాలు తాగితే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తుంటారు. కానీ పాలు సైతం విషతుల్యమవుతున్నాయనేది చేదునిజం. అధిక పాల ఉత్సత్తి కోసం పాడి పశువుల డెయిరీలను నిర్వహిం చే వారు అడ్డదారులు తొక్కుతున్నారు.