సీఎం బహిరంగ సభను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-08-11T05:55:27+05:30 IST

సీఎం బహిరంగ సభను జయప్రదం చేయాలి

సీఎం బహిరంగ సభను జయప్రదం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న రోహిత్‌

  • ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు, ఆగస్టు 10 : వికారాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగను విజయవంతం చేయాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 14న వికారాబాద్‌లో సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని, అనంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. సభకు తాండూరు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 10లక్షల పెన్షన్లు మంజూరు చేసినందుకు గాను సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని, గ్రామాల్లో అర్హులైన వారు ఎవరైనా ఉంటే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై సమీక్షించారు. నేడు(గురువారం) ఫ్రీడం రన్‌ను ఘనంగా నిర్వహించాలని, 12న జరిగే రక్షాభందన్‌ను ఒకే దగ్గర 75మంది చొప్పున స్వయంసహాయక సంఘాల మహిళలు కలిసి వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, అధికార ప్రతినిధి రాజుగౌడ్‌, సీనియర్‌ నాయకులు నర్సింహులు, నర్సిరెడ్డి, శ్రీనివాసాచారి, కౌన్సిల్‌ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు, యువ నాయకులు, జగన్‌, ఇంతియాజ్‌, ఇర్షాద్‌, జావెద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:55:27+05:30 IST