1నుంచి రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనం
ABN , First Publish Date - 2021-11-29T06:24:32+05:30 IST
తిరుపతిలో డిసెంబరు ఒకటో తేదీనుంచి మూడ్రోజులపాటు రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనం నిర్వహించనున్నారు.
తిరుపతి(కల్చరల్), నవంబరు 28: తిరుపతిలో డిసెంబరు ఒకటో తేదీనుంచి మూడ్రోజులపాటు రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆహ్వాన కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యాన, పాడిరైతుల సమస్యలపై చర్చిస్తారని పేర్కొంది. ముఖ్య అతిథిగా ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్కుమార్ అంజన్ హాజరు కానుండగా, 500 మంది రైతు ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేసింది.