వర్షాలకు 190 పశువులు మృతి

ABN , First Publish Date - 2021-11-26T06:44:17+05:30 IST

భారీ వర్షాలకు 190 పశువులు మృతి చెందాయి.

వర్షాలకు 190 పశువులు మృతి

 చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 25: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 190 పశువులు మృతి చెందాయి. వీటిల్లో 39 ఆవులు, 138 గొర్రెలు, ఒక ఎనుము, 12 ఎద్దులు ఉన్నాయని పశుసంవర్థక శాఖ అధికారుల లెక్కలు కట్టారు. కాగా.. మరో ఐదు రోజులు జిల్లాలో వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో పశుసంపదకు నష్టం వాటిళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పశువుల యజమానులకు పశుసంవర్థ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.  

Updated Date - 2021-11-26T06:44:17+05:30 IST