బడికెళ్లాలంటే 2 కి.మీ. నడవాల్సిందే..

ABN , First Publish Date - 2022-08-20T05:14:26+05:30 IST

మండలంలోని వడ్డివారిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు రోజూ బడికెళ్లాలంటే 2 కి.మీ. నడవాల్సిందే.

బడికెళ్లాలంటే 2 కి.మీ. నడవాల్సిందే..
కాలినడకన పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

ఓబుళదేవరచెరువు, ఆగస్టు 19: మండలంలోని వడ్డివారిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు రోజూ బడికెళ్లాలంటే 2 కి.మీ. నడవాల్సిందే. బడి నుంచి హాస్టల్‌ చేరుకోవాలంటే మరో 2 కి.మీ. నడక తప్పదు. ఆ లెక్కన రోజూ వారు 4 కి.మీ. నడవాల్సి వస్తోందన్న మాట. హాస్టల్‌ విద్యార్థులు ఓబుళదేవరచెరువులోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు రావాలి. హాస్టల్‌ నుంచి పాఠశాల 2 కి.మీ. దూరం ఉంది. వసతి గృహంలో మొత్తం 60 మంది విద్యార్థులున్నారు. వీరిలో 5 నుంచి 7వ తరగతి వరకు చదివే 15 మందికి బస్సు పాసులున్నాయి. మిగిలిన 45 మంది విద్యార్థులు బస్సు పాస్‌ సౌకర్యం లేక రోజూ కాలినడకన బడికెళ్లాల్సిందే. నిత్యం 4 కి.మీ. నడక తప్పట్లేదు. విద్యార్థులు నడిచి వెళ్లే దారి కదిరి-హిందూపురం ప్రధాన రహదారి కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. రోడ్డు దాటే సమయంలో ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు. దీంతో భయంభయంగా బడికెళ్లాల్సి వస్తోంది.





Updated Date - 2022-08-20T05:14:26+05:30 IST