సంక్షేమ రంగానికి పెద్దపీట
ABN , First Publish Date - 2021-01-25T05:55:07+05:30 IST
సంక్షేమ రంగానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
పటాన్చెరు, జనవరి 24 : సంక్షేమ రంగానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. సీఎం సహాయనిధి కింది మంజూరైన రూ.13.82 లక్షలను నియోజకవర్గం పరిధిలోని 35 మంది లబ్ధిదారులకు ఆదివారం క్యాంపు కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మనరాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటికే రికార్డు స్థాయిలో లబ్ధిదారులకు సహాయం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహగౌడ్, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు రవీందర్రెడ్డి, హన్మంతరెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్ పాల్గొన్నారు.