దాచారం సర్పంచ్‌పై యువకుడి దాడి

ABN , First Publish Date - 2021-07-27T04:11:18+05:30 IST

తాగునీటి బోరు మరమ్మతు విషయంలో సర్పంచ్‌పై యువకుడు దాడిచేసిన సంఘటన బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో ఆదివారం జరిగింది.

దాచారం సర్పంచ్‌పై యువకుడి దాడి

బెజ్జంకి, జూలై 26 : తాగునీటి బోరు మరమ్మతు విషయంలో సర్పంచ్‌పై యువకుడు దాడిచేసిన సంఘటన బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని 558 సర్వే నంబరు భూమిలో 20 ఏళ్ల క్రితం గ్రామంలో తాగునీటి అవసరాల కోసం బోరు వేయించారు. కొద్దిరోజుల నుంచి బోరువేసిన స్థల విషయంలో బెజ్జంకి క్రాసింగ్‌ గ్రామానికి చెందిన నాగయ్యతో వివాదం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం బోరు మరమ్మతులు చేసేందుకు వెళ్లిన గ్రామపంచాయతీ సిబ్బందితో నాగయ్య దురుసుగా ప్రవర్తించటంతో వారు సర్పంచ్‌ శ్రీనివా్‌సకు తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న సర్పంచ్‌పై నాగయ్య దాడికి దిగడంతో తలకు గాయమైంది. ఈ విషయమై పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-27T04:11:18+05:30 IST