పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , First Publish Date - 2022-08-08T04:55:23+05:30 IST
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కేశంపేట, ఆగస్టు 7: మండలంలోని పాపిరెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05 బ్యాచ్కు చెందిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి, విద్యార్థినులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పాఠశాలకు కంప్యూటర్, స్పోర్ట్స్ కిట్, చెస్, క్యారంబోర్డు, ఇండోర్ గేమ్స్కు సంబంధించిన వస్తువులు అందజేశారు. అనంతరం హెచ్ఎం వెంకటయ్యగౌడ్తో పాటు ఉపాధ్యాయులు రవికుమార్, చంద్రశేఖర్, రాంచంద్రయ్య, రమేష్, పీఈటీలను పూర్వవిద్యార్థులు శాలువ, పూలమాలలతో సత్కరించారు.