మాట తప్పి అడ్డం తిరుగుతారా ...
ABN , First Publish Date - 2020-08-07T17:30:21+05:30 IST
అమరావతినే రాజధానిగా ఆనాడు సమ్మతించిన సీఎం జగన్ ఇప్పుడు మాట తప్పి..
మదనపల్లె(చిత్తూరు): అమరావతినే రాజధానిగా ఆనాడు సమ్మతించిన సీఎం జగన్ ఇప్పుడు మాట తప్పి అడ్డం తిరుగుతారా..? అని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ప్రశ్నించారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో వుండేలా అమరావతిని రాజధాని చేశారన్నారు. అమరావతి రైతులు 30వేల ఎకరాల భూములను రాజధాని కోసం త్యాగం చేశారన్నారు. కాని నేడు సీఎం జగన్ మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాజధానిని తరలించడంపై ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకోవాలని హితవు పలికారు.