నిత్యాన్నదాన పథకానికి రూ.10 లక్షలు
ABN , First Publish Date - 2021-10-18T05:52:40+05:30 IST
సామర్లకోట భీమేశ్వరస్వామి ఆల యంలో నిత్యాన్నదాన పథకానికి అంతర్జాతీయ రొయ్య ఎగు మతిదారుల సంఘ ప్రతినిధి, దేవీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ సూర్యారావు, యార్లగడ్డ వీర్రాజు, యార్లగడ్డ వీర వెంకట సత్యనారాయణ సోదరులు రూ. 10 లక్షల విరాళాన్ని అందించారు.
సామర్లకోట,
అక్టోబరు 17: సామర్లకోట భీమేశ్వరస్వామి ఆల యంలో నిత్యాన్నదాన పథకానికి
అంతర్జాతీయ రొయ్య ఎగు మతిదారుల సంఘ ప్రతినిధి, దేవీ ఫౌండేషన్
వ్యవస్థాపకుడు యార్లగడ్డ సూర్యారావు, యార్లగడ్డ వీర్రాజు, యార్లగడ్డ వీర
వెంకట సత్యనారాయణ సోదరులు రూ. 10 లక్షల విరాళాన్ని అందించారు. ఆదివారం ఆలయ
కార్య నిర్వ హణాధికారి పులి నారా యణ మూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా
జరిగిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న యార్లగడ్డ సోదరులకు ఆలయ
కార్యనిర్వహణాధికారి నారా యణమూర్తి ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల
చిత్రపటాలను అందజేశారు. దాతలు కోరిన రోజులలో అన్నదానాన్ని నిర్వహిస్తామని
ఆలయ ఈవో చెప్పారు.