భక్తులతో రత్నగిరి రద్దీ
ABN , First Publish Date - 2021-10-17T06:31:37+05:30 IST
సత్యదేవుడి సన్నిధి శనివారం భక్తులతో కిటకిటలాడింది. రత్నగిరిపై వివాహం చేసుకున్న జంటలు, వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న దంపతులతో పాటు ఏకాదశి పర్వదినం కావడంతో ఎక్కువ మంది వచ్చారు.
వ్రతాలు చేయించుకుంటున్న భక్తులు
అన్నవరం,
అక్టోబరు 16: సత్యదేవుడి సన్నిధి శనివారం భక్తులతో కిటకిటలాడింది.
రత్నగిరిపై వివాహం చేసుకున్న జంటలు, వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు
చేసుకున్న దంపతులతో పాటు ఏకాదశి పర్వదినం కావడంతో ఎక్కువ మంది వచ్చారు.
శనివారం ఒక్కరోజు సుమారు 3 వేల వ్రతాలు జరగ్గా, వివిధ విభాగాల ద్వారా
సుమారు రూ.30 లక్షల ఆదాయం లభించింది. నిత్యాన్నదాన పథకానికి శనివారం
అనకాపల్లికి చెందిన పట్టా సుజాత రూ.లక్షను ఆలయ పీఆర్వో కొండలరావుకు
సమర్పించారు.