ఏపీజీబీ ఆర్‌ఎం వివేకానంద గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2021-06-23T06:40:28+05:30 IST

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్‌ (ఆర్‌ఎం) వివేకానంద(57) గుండెపోటుతో మృతి చెందారు.

ఏపీజీబీ ఆర్‌ఎం వివేకానంద గుండెపోటుతో మృతి
వివేకానంద (ఫైల్‌)

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 22: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్‌ (ఆర్‌ఎం) వివేకానంద(57) గుండెపోటుతో మృతి చెందారు. అందిన సమా చారం మేరకు.. ఆయన సోమవారం అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తర లించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉద యం 5గంటల సమయంలో గుండెపోటు తీవ్రమై మృతి చెందారు. నగరంలోని అరవింద్‌నగర్‌లోని ఆయన నివా సంలో వివేకానంద భౌతికకాయానికి ఏపీజీబీ చైర్మన రాకేష్‌కశ్యప్‌, జీఎం అనంత పద్మనాభరావు, కదిరి ఆర్‌ఎం సుబ్బారావు తదితర అధికారులు పూలమాలలు వేసి ని వాళి అర్పించారు. వివేకానందకు భార్య భారతి, కుమారుడు లిఖితభార్గవ్‌ ఉన్నారు. కు మారుడు ఉన్నత విద్యకోసం ఐర్లాండ్‌లో ఉండడంతో బ్యాంకు అధికారులు సమాచారా న్ని చేరవేశారు. ఆయన దేశానికి రావడానికి వారం, పది రోజులు పడుతుందని తెలియడంతో బ్యాంకు ఉద్యోగులే వివేకానంద అంత్యక్రియలు నిర్వహించారు. 


Updated Date - 2021-06-23T06:40:28+05:30 IST