ఉత్తమ వీఏఏగా అశోక్ కుమార్
ABN , First Publish Date - 2022-01-27T05:36:42+05:30 IST
రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యవసాయ సహాయకుడిగా పాగోడు గ్రామ సచివాలయ వీఏఏ చింతు అశోక్కుమార్ ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకల సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ బుధవారం ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించి అభినందించారు.
జలుమూరు: రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యవసాయ సహాయకుడిగా పాగోడు గ్రామ సచివాలయ వీఏఏ చింతు అశోక్కుమార్ ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకల సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ బుధవారం ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించి అభినందించారు. ఆర్బీకే ద్వారా రైతులకు ఎరు వులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తూ వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించినందుకు ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా అశోక్కుమార్ను ఎంపీపీ వాన గోపి, పాగోడు సర్పంచ్ దామ మన్మథరావు, ఏవో కె.సురేష్ అభినందించారు.