రైతులను ఇబ్బంది పెడతారా?

ABN , First Publish Date - 2020-10-28T09:33:07+05:30 IST

రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చే స్తారా? అంటూ టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎ్‌సరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రైతులను ఇబ్బంది పెడతారా?

 టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు


శింగనమల, అక్టోబరు 27: రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చే స్తారా? అంటూ టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎ్‌సరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని దీక్ష చేపడుతున్న రైతులకు ఆయన సంఘీబావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది రైతులు భూములిచ్చారన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని మార్పు మూడు రాజధానులంటూ అనాలోచి నిర్ణయాలు తీసుకోవడం బాదిత రైతుల జీవితాలతో ఆడుకోవడమేనన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. లేదంటే రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజల ఆక్రోశానికి గురికాక తప్పదన్నారు.

Updated Date - 2020-10-28T09:33:07+05:30 IST