అప్పుల బాధతో బేల్దారి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-18T06:06:56+05:30 IST

అప్పులబాధతో ఓ బేల్దారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని గీతానగర్‌లో శనివారం చోటు చేసుకుంది.

అప్పుల బాధతో బేల్దారి ఆత్మహత్య

ధర్మవరంఅర్బన, ఏప్రిల్‌ 17: అప్పులబాధతో ఓ బేల్దారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని గీతానగర్‌లో శనివారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన దేవర కొండ వెంకటేశ (31) బేల్దారి పనులు నిమిత్తం మూడు నెలలక్రితం ధర్మవరానికి వలస వచ్చాడు. ఇక్కడ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే బేల్దారికి రూ.2లక్షల దాకా అప్పులున్నాయని, వీటిని ఎలా తీర్చాలో అంటూ తరచూ తీవ్ర మనోవేధనకు గురయ్యేవాడు. ఈ నేపఽథ్యంలో ఇంటిలో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వా స్పత్రికి తరలించారు. మృతుడికి భార్య అనిత, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. 



Updated Date - 2021-04-18T06:06:56+05:30 IST