ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌.. యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2021-03-01T04:43:49+05:30 IST

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌.. యువకుడి దుర్మరణం

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌.. యువకుడి దుర్మరణం

ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడికి గాయాలైన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్‌ పరిధి సీతారాంపేట్‌గేట్‌ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన అనుముల రవికుమార్‌(28), మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మద్దెల వెంకటేష్‌(25) ఆరుట్లలో వేణుగోపాలస్వామి ఉత్సవాలకు హాజరై బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఇబ్రహీంపట్నంవైపు వస్తూ ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. దీంతో రవికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్‌కు గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-03-01T04:43:49+05:30 IST