మద్యం మత్తులో బైక్‌తో ఢీ

ABN , First Publish Date - 2021-05-11T05:26:00+05:30 IST

మద్యం మత్తులో బైక్‌తో ఢీ

మద్యం మత్తులో బైక్‌తో ఢీ
మమత మృతదేహం వద్ద రోదిస్తున్న మహిళ

  • అక్కడికక్కడే యువతి మృతి

శంషాబాద్‌: శంషాబాద్‌ మున్సిపాలిటీ రాళ్లగూడ-దొడ్డి వద్ద సోమవారం బైక్‌ ఢీకొని యువతి మృతిచెందింది. వ్యక్తి మద్యం మత్తులో బైక్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చౌదరిగూడకు చెందిన మల్లేష్‌ శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మల్లేష్‌ బైక్‌పై చౌదరిగూడ నుంచి శంషాబాద్‌ వైపునకు వస్తూ రాళ్లగూడ-దొడ్డి వద్ద మమత(19) అనే యువతిని ఢీకొట్టాడు. తలకు గాయాలై మమత అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెకు కొన్ని నెలల క్రితమే పెళ్లయింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాద స్థలం నుంచి మల్లేష్‌ పారిపోయాడు. అతడిని వెతికి పట్టుకొని విచారించగా ప్రమాద సమయంలో మద్యం తాగినట్టు తేలిందని పోలీసు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-05-11T05:26:00+05:30 IST