రైతుల సంక్షేమానికే బిల్లులు

ABN , First Publish Date - 2020-09-23T06:29:49+05:30 IST

రైతుల సంక్షేమానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన బిల్లులు తెచ్చిందని బీజేపీ వికారాబాద్‌ పట్టణ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి అన్నారు

రైతుల సంక్షేమానికే బిల్లులు

బీజేపీ  పట్టణ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి


వికారాబాద్‌: రైతుల సంక్షేమానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన బిల్లులు తెచ్చిందని బీజేపీ వికారాబాద్‌ పట్టణ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి అన్నారు. నూతన బిల్లులు అమలైన సందర్భంగా మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ చౌరాస్తాలో ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశ రక్షణతో పాటు దేశంలోని ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం అనేక  కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని అన్నారు. రైతులకు నచ్చిన ప్రదేశంలో ధాన్యాన్ని అమ్ముకోవడంతో పాటు ధర లేని సమయంలో వారి ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే సదుపాయాన్ని మోదీ సర్కారు కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివరాజ్‌, బుస శ్రీకాంత్‌, వివేకానందరెడ్డి, కేపీ రాజు, పాండు, పోకల సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-23T06:29:49+05:30 IST