పేదల ఉసురు సీఎంకు తగలక తప్పదు
ABN , First Publish Date - 2021-07-27T06:48:03+05:30 IST
రాష్ట్రంలోని 30లక్షల మందికి గృహాలు నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్కు పేదల ఉసురు తగలక తప్పదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ విమర్శించారు.
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ
ప్రత్తిపాడు, జూలై 26: రాష్ట్రంలోని 30లక్షల మందికి గృహాలు నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్కు పేదల ఉసురు తగలక తప్పదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ విమర్శించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్, జనసేన నియోజకవర్గ కన్వీనర్ వరుపుల తమ్మయ్యబాబులతో కలిసి సోమవారం నిర్వహించిన సమావేశంలో గాంధీ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చే స్థలా లు చెరువులు, కుంటలు, నివాస యోగ్యం కానివి కేటాయించారన్నారు. ధర్మవరంలో 72మంది అర్హులైన పేదల పట్టాలు ఆన్లైన్ చేసి కూడా వారికి మంజూరు చేయలేదన్నారు. పేదలకు జరిగిన అన్యాయం వివరించేందుకు వెళ్లిన బీజేపీ మండల కమిటీ అధ్యక్షుడు గున్నాబత్తుల రాజబాబుపై దాడి చేయడం అమానుషమన్నారు. జనసేన నాయకుడు శేషారావుపై తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నాలు దారుణమన్నారు. బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి వై.మాలకొండయ్య, చిలుకూరి రామ్కుమార్, తమ్మయ్యబాబు మాట్లాడుతూ బీజేపీ, జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ నాయకుడు కుండల సాయికుమార్ యాదవ్, నాయకులు సింగిల్దేవి సత్తిరాజు, కర్రి ధర్మరాజు, కింగుబాబు రాజు, జి.రాజబాబు, హరేరాం, పి.కొండబాబు, మదినే బాబ్జి పాల్గొన్నారు.