పాఠకులకు అందుబాటులో పుస్తకాలు

ABN , First Publish Date - 2022-10-02T05:39:02+05:30 IST

పాఠకులకు అందుబాటులో పుస్తకాలు

పాఠకులకు అందుబాటులో పుస్తకాలు
మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండు రంగారెడ్డి

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండు రంగారెడ్డి 

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 1: పాఠకులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ కప్పా టి పాండు రంగారెడ్డి తెలిపారు. జిల్లా గ్రంథాలయంలో శనివారం పా ఠకులతో సమావేశాన్ని నిర్వహించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ పాఠకులకు కావాల్సిన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచేలా, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలు ఉన్నాయని ఆయన చెప్పారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

  • ఎస్టీ రిజర్వేషన్లను 10శాతానికి పెంచడం చరిత్రాత్మకం

విద్య, ఉద్యోగ అవకాశాల్లో గిరిజనులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 6శాతం నుంచి 10శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డి అన్నారు. ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల గిరిజనుల ఆకాంక్ష సీఎం నిర్ణయంతో నెరవేరనుందన్నారు.


Updated Date - 2022-10-02T05:39:02+05:30 IST