బోసిపోయిన కలెక్టరేట్
ABN , First Publish Date - 2021-05-11T04:57:08+05:30 IST
బోసిపోయిన కలెక్టరేట్
కొవిడ్ ఎఫెక్ట్తో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ బోసిపోయింది. అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. వీటిలో వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తుంటారు. ప్రస్తుతం పలువురు అధికారులు, ఉద్యోగ సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో కొన్ని విభాగాల్లో అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండగా.. వారు విధులకు రావడం లేదు. అన్ని విభాగాల్లోనూ చాలా వరకు అధికారులు, ఉద్యోగులు విధులకు రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమి స్తున్నాయి. దీంతో ఖాళీగా ఉన్న కుర్చీపై హాయిగా కుక్క సేద తీరుతోంది. - ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్