ముమ్మరంగా వేరుశనగ విత్తన సాగు
ABN , First Publish Date - 2022-06-24T06:47:35+05:30 IST
మండలంలో వేరుశనగ విత్తనసాగు ముమ్మరంగా సాగుతోంది. ముందస్తుగా వర్షాలు కురిసి పదును కావడంతో రైతులు ఇదివరకే సేద్యపు పనులు చేసుకున్నారు
కనగానపల్లి, జూన 23: మండలంలో వేరుశనగ విత్తనసాగు ముమ్మరంగా సాగుతోంది. ముందస్తుగా వర్షాలు కురిసి పదును కావడంతో రైతులు ఇదివరకే సేద్యపు పనులు చేసుకున్నారు. గతవారం పదును వర్షం రావడంతో సాగుకు సన్నద్ధం అయ్యారు. దీంతో మండలవ్యాప్తంగా వేరుశనగ విత్తుతూ రైతులు బీజీగా గడుపుతున్నారు. ఇదివరకే బోరుబావుల కింద మండలవ్యాప్తంగా వేరుశనగను సాగుచేశారు. గతేడాది వేరుశనగ పూర్తిగా నష్టపోవడంతో ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని రైతులు తెలుపుతున్నారు. మరికొందరు రైతులు మాత్రం కంది, ఆముదం, అలసంద, సాగు చేస్తున్నారు.