కారు ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-07-27T06:25:49+05:30 IST
రామచంద్రపురం మండలం నరసాపురపుపేట వద్ద సోమవారం కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు.
ద్రాక్షారామ, జూలై 26: రామచంద్రపురం మండలం నరసాపురపుపేట వద్ద సోమవారం కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ సురేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం... కరప మండలం జె.బావారానికి చెందిన సలాది ఈశ్వరరావు (66) తన గ్రామం నుంచి రామచంద్రపురం టీవిఎస్ ఎక్స్ఎల్ మోటారుసైకిల్పై వెళుతుండగా రావులపాలెం నుంచి కాకినాడ వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఈశ్వరరావు కాలు విరిగిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108లో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేశామని ఎస్ఐ సురే్షబాబు తెలిపారు.