వింత వ్యాధితో పశువులు మృతి
ABN , First Publish Date - 2022-05-28T06:58:33+05:30 IST
మండలంలోని నంగమంగళం పంచాయతీలో గురువారం రాత్రి వింత వ్యాధితో మూడు పశువులు మృతిచెందాయి.
గుడిపాల, మే 27: మండలంలోని నంగమంగళం పంచాయతీలో గురువారం రాత్రి వింత వ్యాధితో మూడు పశువులు మృతిచెందాయి. గ్రామంలోని రాజేంద్ర మందడికి చెందిన మూడు ఆవులు మృతిచెందాయి. పశువుల మృతికి కారణాలు తెలియరాలేదు. దీంతో గ్రామంలోని మిగతా పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.