AP News: చంద్రబాబు ఆదేశాలతో కార్యకర్త ప్రాణాలు కాపాడిన యువనేత వరుణ్
ABN , First Publish Date - 2022-08-25T22:03:43+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అన్నా క్యాంటీన్
కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అన్నా క్యాంటీన్ (Anna Canteen) ప్రారంభోత్సవం జరగకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అన్నా క్యాంటీన్ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ, వైపీసీ (TDP YCP) వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల లాఠీఛార్జ్తో టీడీపీ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. చంద్రబాబు ఆదేశించడంతో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ వెంటనే స్పందించారు. కార్యకర్త అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా వైద్య సాయం అందేలా చేశారు. స్వయంగా ఫార్మా రంగానికి చెందిన వరుణ్.. సదరు కార్యకర్తకు ప్రాథమిక చికిత్స అందించి, సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. వరుణ్ చొరవను పలువురు అభినందిస్తున్నారు.