అక్కాచెల్లెళ్ల బలి ఘటనలో తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు: డీఎస్పీ రవి
ABN , First Publish Date - 2021-01-25T14:18:28+05:30 IST
మదనపల్లిలో జరిగిన అక్కాచెల్లెళ్ల బలి ఘటనలో తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు చేయనున్నట్లు డీఎస్పీ రవి మనోహర్ ఆచారీ తెలిపారు.
చిత్తూరు: మదనపల్లిలో జరిగిన అక్కాచెల్లెళ్ల బలి ఘటనలో తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు చేయనున్నట్లు డీఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు. సోమవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో డీఎస్పీ మాట్లాడుతూ ఘటనకు సంబంధించి నిందితుల ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ను తీసుకున్నామని... నిశితంగా పరిశీస్తున్నట్లు చెప్పారు. క్లూస్ టీం ద్వారా కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తున్న విద్యాసంస్థల సిబ్బంది నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నామన్నారు. క్షుద్ర పూజలపై కూడా దృష్టి కేంద్రీకరించినట్లు డీఎస్పీ రవి మనోహర్ ఆచారి పేర్కొన్నారు.