చిత్తూరులో ఏనుగుల సంచారం
ABN , First Publish Date - 2022-02-21T15:00:39+05:30 IST
జిల్లాలోని ఐరాల మండలంలో దివిటీ వారి పల్లి పరిసర ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది.
చిత్తూరు: జిల్లాలోని ఐరాల మండలంలో దివిటీ వారి పల్లి పరిసర ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. పంటల పొలాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. పూల ప్రభాకర్కు చెందిన మామిడి తోటలో కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఏనుగు గుంపు సంచారంతో గ్రామస్తులు, రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.