చిత్తూరులో ఐదు ఎంపీటీసీ స్థానాలు వైసీపీ కైవసం
ABN , First Publish Date - 2021-11-18T19:13:28+05:30 IST
జిల్లాలో మొత్తం ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఐదు వైసీపీ, మూడు టీడీపీ కైవసం చేసుకున్నాయి.
చిత్తూరు: జిల్లాలో మొత్తం ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఐదు వైసీపీ, మూడు టీడీపీ కైవసం చేసుకున్నాయి. కుప్పం మండలం దాచేగానూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అమ్ము 568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గుడిపాల మండలం వసంతపురం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయలక్ష్మి 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేవీపల్లి మండలం తిమ్మాపురం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మి 188 ఓట్ల మెజారిటీతో గెలుపొదారు.
గెలిచిన వైసీపీ అభ్యర్థులు:
* శాంతిపురం మండలం 64- పెద్దూరు వైసీపీ ఎంపీటీసీ యువ కుమార్ 121 ఓట్లతో గెలుపు
* నగిరి మండలం నంబాకం వైసీపీ ఎంపిటిసి అభ్యర్థిగా గుణ శేఖర్ రెడ్డి 63 ఓట్లతో గెలుపు
* గుడిపల్లి మండలం కనమన పల్లి వైసీపీ ఎంపిటి అభ్యర్థి వరలక్ష్మి 494 ఓట్లతో గెలుపు
* ఎస్ఆర్ పురం మండలం వి వి పురం వైసీపీ ఎంపీటీసి అభ్యర్థి ఆదిలక్ష్మి 268 ఓట్లతో గెలుపు
* కె.వి పల్లి మండలం తీతర గుంట వైసిపి ఎంపిటిసి అభ్యర్థి సుబ్రమణ్యం 320 ఓట్లతో గెలుపు